కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు

నవతెలంగాణ హైదరాబాద్: కేరళ సీఎం పినరయి విజయన్‌ (Kerala CM Pinarayi Vijayan) కుమార్తె వీణా విజయన్‌ (Veena Vijayan)తోపాటు మరికొందరిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) అక్రమ నగదు చలామణి చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది. ఆమెకు చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రయివేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. దీని విచారణకు సంబంధించి వీణాతో పాటు మరికొందరికి త్వరలో సమన్లు జారీ చేయనుంది.

Spread the love