కవితను కోర్టులో హాజరుపరిచిన ఈడీ

నవతెలంగాణ ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ఈడీ ఉదయం హాజరుపరిచింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. రాత్రి ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇక్కడి ప్రత్యేక సెల్‌లో ఆమెను ఉంచారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కవితను కోర్టు ముందు హాజరుపరిచారు.

Spread the love