డోంగ్లి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం..

నవతెలంగాణ- మద్నూర్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా డోంగ్లి మండల కేంద్రంలో గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వ్యవసాయ రైతులకు మూడు గంటలే కరెంటు సరిపోతుందని అనుచిత వ్యాఖ్యలు చేయడం వ్యవసాయ రైతులకు ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉండటం వ్యవసాయదారులకు 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అందిస్తుండగా మూడు గంటలే అవసరం అనడం వ్యవసాయదారులకు మోసపూరితమేనని ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యవసాయదారులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయదారులు వ్యతిరేకించాలని వారు కోరారు ఈ ఆందోళన కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రామ్ పటేల్ సర్పంచులు రా కుమార్, సూర్యకాంత్ పటేల్,‌ మండలంలోని వివిధ గ్రామాల ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love