సమానత్వం, సమాజహితమే ఎం ఆర్ పి ఎస్ ఉద్యమ గమ్యం..

– 29 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అండగా నిలిచిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు.
– ఎస్సీ వర్గీకరణ సాధన కోసం దృడ సంకల్పంతో పోరాడుదాం.బాలు యాదవ్ ఎం ఎస్ యు స్టేట్ లీడర్
నవతెలంగాణ -మద్నూర్
కుట్రలను చేదిస్తు ఉద్యమ ద్రోహుల వెన్నుపోట్లను భరిస్తూ, స్వార్థపరుల కల్పించే అడ్డంకులను ఎదుర్కొంటూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం 29 ఏండ్లుగా సజీవంగా నిలబడిందంటే మంద కృష్ణ మాదిగ సమర్థవంతమైన నాయకత్వమే కారణం 75 యేండ్ల స్వతంత్ర్య భారతదేశంలో సుదీర్ఘంగా నడుస్తున్న అతి పెద్ద ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే  ఇన్ని ఏండ్ల పోరాటంలో మాదిగ జాతికి ఆత్మగౌరవం, అస్థిత్వం, గుర్తింపుతో పాటు మొదటి దశలో ఎస్సీ వర్గీకరణ సాధించడం ద్వారా 25 వేల ఉద్యోగాలను ఎమ్మార్పీఎస్ అందించింది.  అలాగే మానవతా దృక్పథంతో గుండె జబ్బుల చిన్నారుల కోసం, వికలాంగులు వృద్దులు వితంతువుల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, హత్యలకు అత్యాచారాలకు గురైన మహిళల కోసం ఇలా ఎన్నో పోరాటాలు చేసి వారి సమస్యలు పరిష్కరించడం జరిగిందని ప్రస్తుతం అనాథ పిల్లల సంక్షేమం కోసం ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుంది.29 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్న   మాదిగ ప్రజలకు, ఉద్యమానికి అండదండలు అందించిన అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు. తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మరోతి కర్రేవార్, కొలవార్ పండరి, మరోతి గడ్డంవార్, రాజు గడ్డంవార్, లక్ష్మణ్ గాడ్డంవార్, మరోతి, గంగారాం, సంగ్రామ్, అంజయా ఈర్బా, హన్మంత్, మరోతి రామ, పండరి, దేవదాస్, రాజేందర్, రాజు ద్యాపుర్వార్, రాందాస్ రామ గడ్డంవార్,నగేష్ రాజు, సంతోష్, అనిల్, శ్రీకాంత్, సంతోష్ కొంబ్లే, లక్ష్మణ్ సంబజి, శ్రీకాంత్, లక్ష్మణ్ ద్యపుర్వర్, తదితరులు యువకులు పాల్గొన్నారు.
Spread the love