రెండో రోజు కొనసాగిన కార్మికుల సమ్మె..

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని చేపట్టిన సమ్మె శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకి ప్రభుత్వం భరోసా కల్పిస్తూ కనీస వేతనాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు వస్త్రాల ప్రమోద్, దుర్గయ్య, సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love