కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షునిగా ఈరంటి లింగం నియామకం

నవతెలంగాణ- కంటేశ్వర్ 
కాంగ్రెస్ భవన్ నందు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షునిగా ఈరంటీ లింగంను నియమిస్తూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి  చేతుల మీదుగా ఆర్డర్ కాపీ ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఎస్సీ సెల్ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలకు చేసిన అభివృద్ధి పనులను అందరికీ వివరించాలని ,రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనుల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వివరించాలని ఈ సందర్భంగా ఈరంటి లింగం కు తెలియజేస్తూ అధ్యక్షునిగా నియమితులైనందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ,పీసీసీ ఉపాధ్యక్షులు తహెర్ బిన్ హమ్దన్ ,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు, రూరల్ ఇన్చార్జి భూపతిరెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, జిల్లా మాజీ బీసీ సెల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంతిరెడ్డి రాజారెడ్డి, గంగారెడ్డి, నవీన్ ,భాస్కర్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love