టిఎస్ఎల్ పిఆర్ బి – 2022 సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియా నిర్వహణ

– నేటితో ముగిసిన నిజామాబాద్లో పోలీస్ రిక్రూటుమెంటులో
నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూటుమెంటు బోర్డు నిర్వహిస్తున్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియా కార్యక్రమం ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, ఐ.పి.యస్. ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (ఎ.ఆర్) గిరిరాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు సర్టిఫికేటు వెరిఫికేషన్ ప్రక్రియా నిర్వహించడం జరుగుతుంది. ఈనెల తేది 14-06-2023 నుండి తేది: 23-06-2023 వరకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటి వరకు 5313 మంది అభ్యర్థులను పిలవగా అందులో 4736 మంది అభ్యర్ధులు హజరుకాగ వారి ద్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా పరిపాలన అధికారి ( ఎ.ఓ ) బి. శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, మక్సూద్ హైమద్, గోవింద్ మరియు సి.పి.ఓ కార్యాలయం సిబ్బంది, రిజర్వు విభాగం సిబ్బంది ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love