ఆర్మూర్ పట్టణంలో బలిదాన్ దివస్ కార్యక్రమం

– ఆర్మూర్ పట్టణంలో బలిదాన్ దివస్ కార్యక్రమం
నవతెలంగాణ – ఆర్మూర్
భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 70వ వర్ధంతిని పురస్కరించుకొని “బలిదాన్ దివస్” గా నిర్వహిస్తూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ..డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఈ దేశానికి మొట్టమొదటి పరిశ్రమల మరియు సరఫరాల మంత్రిగా నెహ్రూ యొక్క మంత్రివర్గంలో పని చేయడం జరిగిందని. కొంతకాలానికి నెహ్రూ యొక్క విధానాలు నచ్చక భారతీయ జన సంఘ్ పార్టీని స్థాపించి ఈ దేశం ధర్మం రక్షించబడాలని. మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం సంతుస్టీకరణ విధానం సరైంది కాదని. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరమని. కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ “ఏక్ దేశమే దో విధాన్ – దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి చలేగా — నహి చలేగా” (ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు మరియు రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదు – ఉండకూడదు) అని నినదించిన ఒక ప్రఖండ దేశభక్తుడని. ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తూ 1953లో కాశ్మీర్ కు వెళ్లి ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని ధర్నా చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసి కారాగారంలో వేయడమైందని. అదే కారాగారంలో జూన్ 23న మరణించినట్లుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని. కాని శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరణం అనుమానాస్పదం కావడంతో దీనిపైన విచారణ చేయాలని అప్పటి జనసంఘ్ నాయకులు డిమాండ్ చేసినా నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదని. శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరణం ఇప్పటికీ రహస్యంగా మిగిలిపోయిందని. కానీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆదర్శాలను, ఆలోచనలను గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ ను రద్దుచేయడమే కాకుండా ఈ దేశాభివృద్ధికై భారత ప్రధాని శ్యామ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆలోచనలను, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తాఉన్నారని. కాబట్టి రాబోయే కాలంలో మరోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని బలపరచవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బిజెపి సీనియర్ నాయకులు బొట్ల విజయ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానంద్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వర్, గిరిజన మోర్చ మాజీ జిల్లా అధ్యక్షులు కొర్ర గంగాధర్, పట్టణ కార్యదర్శులు ఖాందేశ్ ప్రశాంత్, పులి యుగంధర్, గిరిజన మోర్చ పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్ సింగ్, ఓబీసీ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి మిర్యాల్కర్ కిరణ్, ఉపాధ్యక్షులు సుంకరి రమణ బారడ్ వినోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love