కార్యాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం సమీపంలో శనివారం ఆర్ అండ్ బి ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయాన్ని శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆర్ అండ్ బి జాతీయ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస సుభాష్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, జెడ్పిటిసి భూక్య మంగా ,బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, కౌన్సిలర్లు బోజు రమాదేవి రవీందర్, సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love