– ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
– సుభాష్ నగర్ డివిజన్ డీపీ కాలనీలో 61 రోజు పాదయాత్ర
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని డీపీ కాలనీలో ”ప్రగతి యాత్ర”లో భాగంగా 61వ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి.. చేపట్ట వలసిన పనులను తెలుసుకున్నారు. కాగా పార్క్ అభివృద్ధి, సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే దృష్టికి కాలనీవాసులు తీసుకురాగా అక్కడే ఉన్న అధికా రులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వాటి వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పూర్తి చసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ పాపమ్మ , డీజీఎం అప్పల నాయుడు, మాజీ కౌన్సిలర్ బొబ్బ రంగారావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్ , సీనియర్ నాయకులు వెంకటస్వామి, యూసుఫ్ , మన్నన్, అనిల్ ప్రభాకర్ , పద్మజా రెడ్డి ,విష్ణు, శేఖర్, కాలనీ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్ , సుధీర్ రెడ్డి, రంగస్వామి, ఖాజా , శ్రీనివాస్, పథ్వి , వీరేశం గౌడ్ ,వాసు, లలిత గౌడ్ , శీను , లలిత్ కుమార్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.