కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. అడవులను విడిచి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాలను కోతుల ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. పంట పొలాలకు నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టాలను తెచ్చి పెడుతున్నాయి. ఈ రోజు కోతుల దాడిలో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది.  జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లి గ్రామంలో ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్తున్న మహిళపై కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి కోతులను బెదిరి కొట్టారు. గాయపడిన మహిళను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Spread the love