గ్రామాల్లో  ఎన్నికల ప్రచారo

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో ఆదివారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్, బి ఆర్ ఎస్ తోపాటు బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని గ్రామాల్లో గడపగడపన, బైక్ ర్యాలీలతో నిర్వహించారు. జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, ఇన్చార్జి అధ్యక్షులు మద్దికుంట నరస గౌడ్ ఆధ్వర్యంలో రెడ్డి పెట్, స్కూల్ తాండ, బట్టు తాండ, జగదాంబ తండాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించి, చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షట్కర్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి నాయక్, చందర్ నాయక్, నాయిని నర్సింలు, సలావత్ తిరుపతి, గంగావత్ సంతోష్ నాయక్, బోజు నాయక్, విట్టల్ నాయక్, ఈర్షద్, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love