– నూతన ట్రాన్స్ఫార్ ప్రారంభం
మణికొండ వైస్ ఛైర్మెన్ నరేందర్రెడ్డి
నవతెలంగాణ-గండిపేట్
విద్యుత్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని వైస్ ఛైర్మెన్ కొండకళ్ల నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మణికొండ మున్సిపాలిటీలోని 13వ వార్డు హన్మాన్ టెంపుల్ వద్ద లోఓల్టెజీ సమస్యను పరిష్కరించేందుకు నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సం దర్బంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్క రించేందుకు కృషి చేస్తామన్నారు. ఎలాంటి సమస్య లున్న దశల వారిగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమం లో ఎఈ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు శ్వేతరవికాంత్రెడ్డి, వం దన నాగేష్, కో ఆప్షన్ సభ్యులు జోన్నాడ లక్ష్మీ, లైన్ మెన్ రవికుమార్, బిల్ కలెక్టర్ చెన్న కేశవులు, నాయ కులు చిల్కూరి బీరప్ప, రాములు, వెంకట్రావ్, అనం ద్, రాజేష్, భరతమ్మ, తదితరులు పాల్గొన్నారు.