ఆధ్యాత్మిక చింతనలో హాజీపూర్‌ గ్రామస్తులు

శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో
శ్రీ మల్లికార్జున స్వామి వీధి నాటకం బృందం సభ్యులు, స్థానిక సర్పంచ్‌ ఒంగనీబాయి శ్రీనివాస్‌
నవతెలంగాణ-యాలాల
యాలాల మండలంలోని హాజీపూర్‌ గ్రామం ఆధ్యా త్మిక చింతనతో వెల్లివిరుస్తుంది. ఇటీవల హాజీపూర్‌ గ్రా మంలో శ్రీ మల్లికార్జున స్వామి మహత్యం వీధినాటకం భక్త బృందం వైభవంగా స్థానిక సర్పంచ్‌, గ్రామపెద్దల ఆధ్వ ర్యంలో 6 రాత్రులు నిర్వహించారు. వీధి నాటకం ముగిం పు అనంతరం సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మల్లికా ర్జునస్వామి మహత్యం వీధి నాటకం ప్రదర్శించిన భక్త బృం దం సభ్యులను శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో దైవదర్శనం చేసుకున్నారు. గత నెలలో హాజీ పూర్‌ గ్రామంలోనే శివ భక్త సిరియాల వీధి నాటకాన్ని భక్త బృందం సభ్యులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వారిని కూ డా స్థానిక సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శ్రీశైలం దేవాల యానికి తీసుకువెళ్లి ప్రత్యేక దర్శనాలు చేయించారు. ఈ సందర్భంగా హాజీపూర్‌ గ్రామస్తులు సర్పంచ్‌ ఓ.శ్రీనివాస్‌ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో యువ నాయకులు శంకరి మల్లేశం, రాజేందర్‌, వెంకటప్ప, నర్సిములు, అంజిలప్ప, భక్త బృందం పాల్గొన్నారు.

Spread the love