ప్రయాణీకుల కోసం TSRTC బంపర్ ఆఫర్స్..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుక్రవారం ప్రయాణీకుల కోసం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు.. ఎనిమిది రోజుల ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటే రిజర్వేషన్ ఫీజును ఉండదని ప్రకటించింది. ఎనిమిది రోజుల ముందుగానే బుకింగ్‌లు చేసుకోడానికి.. కోసం http://tsrtconline.in వెబ్ సైట్ విజిట్ చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా వేసవి నేపథ్యంలో తెలంగాణ నుంచి.. ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. యాత్రికుల సంఖ్య పెరగడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి.. శ్రీశైలంకు బస్సు సర్వీసులు, ఫ్రీక్వెన్సీని పెంచాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సు సర్వీసులు మహత్మగాంధీ బస్ స్టేషన్ నుండి తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమతాయి. రాత్రి 11:45 వరకు కొనసాగుతాయి. యాత్రికులు వారి ప్రయాణ అభిరుచికి తగ్గట్లుగారాత్రి లేదా పగలు సమాయాల్లో ఈ బస్సు సర్వీసులను వినియోగించుకోవచ్చు.
హైదరాబాద్‌లోని వండర్‌లా కూ టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి సూపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. మీరు టీఎస్ఆర్‌టీసీ బస్సులో వండర్‌లాకు వెళ్తే పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 15 శాతం రాయితీ పొందొచ్చు. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వండర్‌లాకు టీఎస్ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించి.. వండర్‌లాకు వచ్చే వారికి.. పార్క్ ఎంట్రీ టికెట్స్‌పై 15 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ అందుబాటులో ఉంది.
హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గాల్లో ప్రయాణించేవారికి… హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్‌లో వెళ్లే ప్రయాణీకులు.. ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను కల్పిస్తున్నట్లు రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. తిరుగు ప్రయాణ టికెట్‌పై ఈ రాయితీ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది.

Spread the love