తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి అవసరం: కడియం శ్రీహరి

నవతెలంగాణ – ధర్మసాగర్
ఫాతిమా మాత తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి అవసరమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం మండలంలోని తాటికాయల గ్రామంలో ఫాతిమా మాత దేవాలయ ప్రతిష్టోత్సవానికి వరంగల్ మేత్రాణులు బిషప్ ఉడుముల బాల, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.పరిశుద్ధ ఫాతిమా మాత దేవాలయ ప్రతిష్టోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి మనిషికి కష్టాలు నష్టాలు ఉండనే ఉంటాయని అలాంటి సమయంలో మనస్ఫూర్తిగా ఆధ్యాత్మికతతో మనసును లగ్నం చేసి దేవాలయంలో ప్రార్థనలు చేస్తే మనశ్శాంతి దొరుకుతుందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పార్లమెంట్ ఎన్నికల్లో విజయాన్ని చేకూర్చాలని బిషప్ గారితో ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది.ఈ సందర్బంగా చర్చ్ పాస్టర్ దాసయ్య  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love