– ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం
– గిగ్ వర్కర్ల కోసం రూ. 5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ..: సీఎం రేవంత్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బారులు, ఆటో డ్రైవర్ల (గిగ్ వర్కర్లు)కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురా వడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. నాలుగు నెలల క్రితం స్విగ్గి డెలివరీ బారును కుక్క తరిమితే అతడు భవనంపై నుంచి పడి మతి చెందిన ఘటనలో కుటుంబం వివరాలను సేకరించి సీఎం సహాయనిది నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలంటూ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ప్రత్యేకంగా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన హామీనిచ్చారు. శనివారం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బారులు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవటానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటుమని హామీనిచ్చారు. వివిధ తరగతులకు సామాజిక రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామంటూ తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట ఇచ్చారు.. ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం రాజస్థాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్ధవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీనిచ్చారు.
‘సంస్థలు కూడా కేవలం లాభాపేక్షగా మాత్రమే పని చేయకుండా, కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించాలి. గివ్ అండ్ టేక్ పాలసీని పాటించని ఎంత పెద్ద సంస్థలపైన్నైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాబోం. నాలుగు నెలల క్రితం స్విగ్గి బారు కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందాడు. అప్పట్లో ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సాయం అందిస్తారని చూశా.. కానీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిది నుంచి రూ. 2 లక్షలు అందించాని అధికారులకు ఆదేశిస్తున్నా…’ అని సీఎం తెలిపారు.
ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కింద గ్రామసభలు నిర్వహిస్తున్నామనీ, అక్కడ క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బారులు, ఆటో డ్రైవర్లు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి విన్నవించుకోవచ్చని సీఎం ఈ సందర్భంగా సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా వాటిని సమర్పించొచ్చని తెలిపారు. ప్రతీ నాలుగు నెలలకొకసారి గ్రామ సభలు నిర్వహిస్తామనీ, ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఏఐసీసీ సెక్రెటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.