గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

Gurukula-Studentsనవతెలంగాణ – హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈ నెల 23 వరకు పొడిగిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయం తీసుకుంది. 643 గురుకులాల్లో మొత్తం 51,924 సీట్ల కోసం ఇప్పటి వరకు 1.10 లక్షల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ నెల 20తో ముగియాల్సిన గడువు మరో 3 రోజులు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి, గురుకుల సెట్‌ కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.

Spread the love