మతోన్మాద బీజేపీ, దానికి మద్దతిచ్చే

మతోన్మాద బీజేపీ, దానికి మద్దతిచ్చే– టీడీపీ – జనసేన కూటమి,
– నిరంకుశ వెసీపీిలను ఓడించండి
– సీపీఐ(ఎం), సీపీఐ(ఏపీ) రాష్ట్ర సదస్సు పిలుపు
విజయవాడ : రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని, దానికి మద్దతిస్తున్న టీడీపీ-జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం)-సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. విజయవాడలోని ఎంబీవీకేలో మంగళవారం జరిగిన ఈ సదస్సుకు భారీ స్పందన లభించింది. వామపక్షాలు, కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రంలోని బీజేపీ యేతర పార్టీలు ఒకే వేదికపైకి వచ్చిన ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో ప్రజానీకం కదలిరావడంతో ఎంబివికె కిటకిట లాడింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మతం పేరిట ప్రజలను విభజిస్తూ, అదే సమయంలో అదాని, అంబాని వంటి కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్న తీరును, . ప్రత్యేక హోదాతోపాటు, విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహంచేస్తున్నా టీడీపీ-జనసేన, వైసీపీలు బీజేపీని బలపరుస్తున్న తీరును వక్తలు వివరించారు. బీజేపీని, దానికి మద్దతిస్తున్న టీడీపీ-జనసేన కూటమిని, నిరంకుశ వైసీపీలను ఓడించాలన్న తీర్మానాన్ని సదస్సు హర్షధ్వానాలతో ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రంలో బీజేపీని ఓడించడమంటే, దానికి కొమ్ముకాస్తున్న టీడీపీ-జనసేన కూటమి, నిరంకుశ వైసీపీని ఓడించడమే. రాష్ట్రం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం, మత సామరస్యం కోసం వామపక్ష లౌకిక శక్తులను బలపర్చాలని ఈ సదస్సు రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేసింది.

Spread the love