నిజామాబాద్ పోలీస్ శాఖలో జూలై 31న పదవి విరమణ చేయడం జరుగుతున్న నేపద్యంలోని వారి వివరాలు ఇలా వున్నాయి. జూలై నెలలో పదవి విరమణ చేసిన సిబ్బంది. ఎ. దేవ్ రావ్, ఎస్.ఐ, సి.టి.సి, జాన్కంపేట్, నిజామాబాద్ పోలీస్ శాఖలో (41) సం॥ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ చేశారు. డి. మహేంధర్, ఎస్.ఐ, పోలీస్ కంట్రోల్ రూమ్, నిజామాబాద్ పోలీస్ శాఖలో (41) సం||ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ చేశారు.ఎస్. గ్యాన్ సింగ్, ఎస్.ఐ. పోలీస్ కంట్రోల్ రూమ్, నిజామాబాద్ (40) సం॥ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ చేశారు. ఎమ్. సత్యనందమ్, ఎ.ఎస్.ఐ, టౌన్ 5 పోలీస్ స్టేషన్, నిజామాబాద్ పోలీస్ శాఖలో (34) సం॥ల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ చేశారు. ఈ మేరకు బుధవారం వదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వ హించడం జరిగింది. వీరికి శాలువలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు (జ్ఞాపికలతో) ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవర్, ఐ.పి.యస్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటిరిమార్కు లేకుండా పదవివిరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటలు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన తమకు ఎల్లవేళల సహయపడుతామని, తమ కుటుంభ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోళ్లు సందర్బంగా అదనపు డి.సి.పి (అడ్మిన్) బి. కోటేశ్వరరావు, ఎ.ఓ శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంటు శంకర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.