నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిలింనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చి డివైడర్ను ఢీకొట్టింది కారు. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. కారులో ఉన్న ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.