ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలి..

– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్…
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్, మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు తో కలిసి సందర్శించారు. సోమవారం డిచ్ పల్లి మండలం లోని దర్మారం బీ, నడ్పల్లి, డిచ్ పల్లి లో ఉన్న ఎరువుల విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాస్  మిషన్ లో ఉన్న ఎరువుల బస్తాల  నిల్వలు, భౌతికంగా ఉన్న నిల్వలను  ఆన్లైన్ వెరిఫికేషన్ చేయడం జరిగిందని వివరించారు. ఎరువుల బస్తాలు ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే రైతులకు విక్రయించాలని,అలా కాకుండా నేరుగా రైతులకు అందజేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Spread the love