మృతుని కుటుంబానికి మదర్ డైరీ సభ్యుల ఆర్థిక సహాయం

నవతెలంగాణ -పెద్దవూర
మండల పరిధిలోని పోతునూరు గ్రామానికి చెందిన మదర్ డైరీ సభ్యులు  పెండ్యాల నరసింహారావు ఇటీవల  గత కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. మృతుడు మదర్ డైరీ లోసభ్యుడుగా ఉండడంతో గురువారం అతడి కుటుంబ సభ్యులకు పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పదివేల రూపాయలుఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో  పోతునూరు మదర్ డైరీ చైర్మన్  రేపాకుల బక్కయ్య, హాలియా సొసైటీ  మేనేజర్ సత్యం, సూపర్వైజర్  బాలయ్య,డైరెక్టర్ ఎరకల గోపయ్య, ఎలిజాల వెంకటయ్య, ముత్యాలు, నాగరాజు, ఎలిజాల సత్తయ్య, ఎలిజాల ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
Spread the love