కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ- భిక్కనూర్: మండలంలోని ఇసన్న పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీనివాస్ ఇటీవల కాలంలో అనారోగ్యం కారణంగా మరణించారు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం కార్యకర్త కుటుంబానికి 5వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, నాయకులు యాదగౌడ్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love