మృతిచెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం ..

– కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట వెంకన్న 
నవతెలంగాణ – నెల్లికుదురు 
కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సలగు పూర్ణచందర్ ఇటీవల మృతిచెందగా కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట వెంకన్న తెలిపారు బుధవారం మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర తో కలిసి మృతి చెందిన కీసాన్సిల్ మండల అధ్యక్షుడు సలుగు పూర్ణ చందర్ కుటుంబ సభ్యులకు రూ 10,000 ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఒక నిమిషం మౌనం పాటించి పార్టీకి చేసిన గుర్తింప గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులను ఓదార్చినట్టు తెలిపారు ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు ఎంతో మందికి ఎన్నో రకాలైన సేవలు అందించాలని ఆయన సేవలకు ప్రతి ఒక్క రుణపడి ఉన్నామని అన్నారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు నా వంతు సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రత్నపురం యాకయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు పులి వెంకన్న మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ మాజీ ఉపసర్పంచ్ గుండ్లపల్లి యాకయ్య వెన్నం క్రాంతి రెడ్డి పులి  నరసయ్య సలుగు  హనుమంతు  ఓ బి సి మండల అధ్యక్షులు ఆకుల నరసయ్య గ్రామ ఉపాధ్యక్షులు ఆకుల కొమురెల్లి పాము వెంకన్న గుండెబోయిన మల్లయ్య చంద్రు నాయక్  తదితరులు పాల్గొన్నారు
Spread the love