కెఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌కు జరిమానా

లక్నో : లక్నో సూపర్‌జెయింట్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్లకు మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించాడు. శుక్రవారం లక్నో ఎకానె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నిర్దేశిత సమయంలో ఓవర్ల కోట పూర్తి చేయటంలో ఇరు జట్లు విఫలం అయ్యాయి. దీంతో మ్యాచ్‌ రిఫరీ ఇరు జట్ల కెప్టెన్లకు జరిమానా విధించాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో లక్నో కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌, చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌లకు ఇదే తొలి స్లో ఓవర్‌రేట్‌ తప్పిదం కావటంతో చెరో రూ.12 లక్షల జరిమానాతో సరిపెట్టాడు.

Spread the love