ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు…

నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య బెంగాల్‌ నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులను రైలులో నుంచి దించివేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే మంటలు క్రమంగా మిగతా బోగీలకు విస్తరిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ సికింద్రాబాద్‌ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

Falaknuma-Express

Spread the love