ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ఒకసారి మహిళకు హోంమంత్రి పదవి లభించింది. 2009 రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో చేవెళ్ల చెల్లెమ్మగా పేరుగాంచిన సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె భర్త ఇంద్రారెడ్డి కూడా 1994లో టీడీపీ ప్రభుత్వంలో హోంశాఖ పదవి చేపట్టారు. భార్యాభర్తలిద్దరూ ఒకే మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టడం కూడా అరుదైనదే.