తపస్వి లో అన్నదాన కార్యక్రమం

నవతెలంగాణ -ఆర్మూర్
తెలంగాణ విమోచన సందర్భంగా బీసీల కోసం విమోచన జరగాలని బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశయాలను కొనసాగించే దశగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా మైనార్టీ సెల్ నిర్మల్ జిల్లా నాయకులు ఎండి అజారుద్దీన్ గారి పుత్రిక జెరూష జన్మదిన వేడుకలను ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి గల తపస్వి స్కూల్ నందు ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బిఎస్పి బాల్కొండ నియోజకవర్గం నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిని చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గతంలో ఆర్ఎస్ రంగమ్మ గారికి గురు కులాలు పాఠశాలలో సెక్రెటరీగా పని చేసినటువంటి అనుభవం ఉందని. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అయితే అనాధల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో , నిర్మల్ జిల్లా మైనారిటీ సెల్ నాయకులు, జెరూష సారమ్మ, భూలక్ష్మి, జోయల్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love