- Advertisement -
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పే స్కేల్ సాధనలో భాగంగా శనివారం టీటీడీసీ కార్యాలయంలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో వీజీఆర్ ఉద్యోగుల నూతన జేఏసీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ అధ్యక్షులుగా శ్రీనివాస్ ఏపీఓ, బజారత్నూర్, ఉపాధ్యక్షులుగా నరేందర్ ఈసీ – భీంపూర్, జనరల్ సెక్రటరీగా బాపురావు టీఏ, గౌరవ అధ్యక్షులుగా రసీద్ హెచ్ఆర్ మేనేజర్, స్వామి టీఏ లను ఎన్నుకున్నారు. సభ్యులుగా అందే సతీష్, సత్యనారాయణ, ఖాన్, మహేష్, మహిళా సభ్యులుగా భాగ్యలక్ష్మి, రమాకాంత, సుజాతలను ఎన్నిక చేసినట్లు పేర్కొన్నారు. పే స్కేల్ సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని నూతన కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
- Advertisement -



