భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి

Former-Bhadrachalam-MLA-Kunja-Satyavathy-passed-awayనవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి చెందారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కుంజ సత్యవతి గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి ఆమెకు తీవ్ర చాతినొప్పి రావడంతో… వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించారు. 2009 సంవత్సరంలో భద్రాచలం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన సత్యవతి.. ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేకపోయారు. ఇక తాజాగా ఆమె గుండెపోటుతో మరణించడంతో బీజేపీ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే,బీజేపీ నేత కుంజ సత్యవతి మృతి పట్ల రాజకీయాన్ని నాయకులు సంతాపం తెలుపుతున్నారు.

Spread the love