మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్​కు పరోక్షంగా వార్నింగ్

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్​కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తాను మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ పని పడతానని వ్యాఖ్యలు చేశారు. భారత్​లో పన్ను రేట్లు అధికంగా ఉన్నాయంటూ మరోసారి ధ్వజమెత్తారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందని.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి తాను అధికారాలు చేపడితే అదే స్థాయిలో తాను భారతీయ వస్తువులపై పన్నులు విధిస్తానని హెచ్చరించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముందుగా రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. సర్వేల ప్రకారం చూస్తే.. రిపబ్లికన్ మద్దతుదారుల్లో 50 శాతానికి పైగా ట్రంప్​కే అండగా ఉన్నట్లు తెలుస్తోంది.

Spread the love