ఏపీలో 10 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

నవతెలంగాణ – అమరావతి
ఏపీలో విద్యుత్ రంగ ఉద్యోగుల్లో అసంతృప్తి రాజుకుంది. తమ సమస్యలపై విద్యుత్ సంస్థల యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో, జేఏసీ నిరవధిక సమ్మెకు నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది. ఈ నెల 8న విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలి రావాలని జేఏసీ పేర్కొంది.

Spread the love