ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన మాజీ సర్పంచ్..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల జామా మసీదులో ఆదివారం రోజు మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా  మాజీ  సర్పంచ్ విట్టల్ రెడ్డి ముస్లిం సోదరులకు ఉపవాస దీక్షను విరమింప చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, వాసు రెడ్డి, డ్యూటీ కిష్టయ్య, సుధాకర్, శేఖర్, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, మన్నకటి తోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love