కాంగ్రెస్ లో చేరిన డీఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్..

– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బి.వి శ్రీనివాస్
నవతెలంగాణ – వేములవాడ
మాజీ డి ఎస్ ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సెంట్రల్ కమిటీ సభ్యులు గుడిసె ప్రభాకర్ శుక్రవారం ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బి.వి శ్రీనివాస్ ,యువజన కాంగ్రెస్ జాతీయ ఇంచార్జ్ అలువేరి కృష్ణ, సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనివాస్ ,కృష్ణ లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి గుడిసె ప్రభాకర్ ను ఆహ్వానించారు.  ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకువెళ్లడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. రాహుల్ గాంధీ యువతరానికి స్ఫూర్తి, కాబోయే ప్రధాని అని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సురభి దివేది, రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంగీత శ్రీనాథ్ , యువజన జాతీయ కార్యదర్శి శ్రావణ్ రావు, జాతీయ కార్యదర్శి తెలంగాణ ఇంచార్జి రమేష్ బాబు, సాగరిక రావు, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామర్ధి గోపి, శివ రాథోడ్, సామ్రాట్, ప్రధాన కార్యదర్శి మాజిద్, అధికార ప్రతినిధి రెడ్డిమల్ల భాను, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్, సిరిసిల్ల అసెంబ్లీ అధ్యక్షులు చుక్క రాజాశేఖర్, హుస్నాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాకేష్,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love