- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని దాచారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళ సంఘ భవన నిర్మాణ పనులు సర్పంచ్ బైర మానస,వార్డు సభ్యులతో కలిసి సోమవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరీ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సర్పంచ్ మానస కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ దీటీ బాలనర్స్, పంచాయతీ కార్యదర్శి సురేశ్, నాయకులు బైర సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



