మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ-భిక్కనూర్
హైదరాబాద్ లోని మంత్రి మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో మండలంలోని కాచాపూర్, కంచర్ల గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి  వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అంతకుముందు కాచాపూర్ గ్రామ సర్పంచ్ సులోచన సుదర్శన్, కంచర్ల గ్రామ సర్పంచ్ చంద్రకళ మాధవరెడ్డి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రతి ఒక్కరూ వైద్య శిబిరంలో వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు గ్రామస్తుల తరఫున ఆయా గ్రామాల సర్పంచులు మల్లారెడ్డి హాస్పిటల్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, ఉపసర్పంచ్ సిద్దా గౌడ్, కంచర్ల ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు, డిసిసిబి డైరెక్టర్, బస్వాపూర్ సొసైటీ చైర్మన్ కిష్టా గౌడ్, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love