బీఆర్ఎస్ పథకాలను గడపగడపకు తెలియాజేయలి: గాదరి కిషోర్

నవతెలంగాణ- తుంగతుర్తి
తుంగతుర్తి నియోజకవర్గంలో రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని తుంగతుర్తి శాసనసభ సభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల మండలాల బూతు స్థాయి కమిటీల, గ్రామ శాఖ, మండల శాఖ కమిటీల  సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు 100 ఇండ్లకు వెళ్లి ఆయా ఇళ్లలో అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను తెలిపి దానికి అనుగుణంగా మా టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సవివరంగా తెలియపరచాలని బూత్ కమిటీ మెంబర్లకు సూచించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పని చేయాలని ప్రతి ఓటర్ను కలవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోనే అమలవుతున్న దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా ,కల్యాణ లక్ష్మి ,ఆసరా పెన్షన్లు అందరికీ అందిస్తున్నామని ఒకవేళ రాని వారు ఎవరైనా ఉన్నట్లయితే రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయిలో అందిస్తామని తెలియపరిచారు. అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని అన్నారు. బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలలో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదని అన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో పేదలకు మేలు చేసేదిగా ఉందని ప్రజలు దీనిని గమనించి టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి మూడోసారి కెసిఆర్ ని ముఖ్యమంత్రి చేసేందుకు మనందరం సంసిద్ధులం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబాటులో ఉందని అన్నారు ముఖ్యంగా సాగు తాగునీటి రంగాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వ్యవసాయ రంగంలో ముందంజలో ఉందని అన్నారు రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అందుకు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలని అన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా మూడోసారి కెసిఆర్ కావాలని అప్పుడే తెలంగాణ రాష్ట్రం తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే అన్నారు ఈ సందర్భంగా పలువురి విపక్షాలకు చెందిన నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ ఎస్ కే రజాక్ లతోపాటు మూడు మండలాల అధ్యక్షులు, బూతు ఇన్చార్జీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love