జీవితాంతం ప్రజల కోసం పోరాడిన గద్దర్‌

– టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు
– గద్దర్‌ కుటుంబ సభ్యులకు పరామర్శ
నవతెలంగాణ-నేరేడ్‌మెట్‌
తన జీవితాంతం ప్రజల కోసం పోరాడిన ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ అని ఆయన మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓ మంచి నాయకున్ని కోల్పోయా రని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా లోని అల్వాల్‌లో గద్దర్‌ నివాసం ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామ ర్శించారు. అంతకు ముందు గద్దర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గద్దర్‌ తన పాటల ద్వారా ప్రజల కోసం పోరాడారన్నారు. మేం రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం పోరా డుతున్నామన్నారు. గద్దర్‌ తన పాటల ద్వారా ప్రజల సమస్యలపై గళమెత్తారని తెలిపారు. 1997లో గద్దర్‌పై జరిపిన కాల్పుల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేశారని, అది వాస్తవం కాదన్నా రు. కాల్పుల అనంతరం గద్దర్‌ తనను పలుమార్లు కలిశారని చెప్పారు. అప్పట్లో ఆయనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాన్ని కావాలన్నా అందించామని తెలిపారు. ఎల్లవేళలా గద్దర్‌ కుటుంబానికి తాను అండగా ఉంటానన్నారు. ఆయన వెంట టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, అధికార ప్రతినిధి జోష్ణ, మల్కాజిగిరి కోఆర్డినేటర్‌, రాష్ట్ర నాయకులు చిత్రాల సంతోష్‌ సాగర్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకు లు, ఐటీడీపీ నాయకులు రవీందర్‌, హరి కృష్ణ, మల్కాజిగిరి నాయకులు బత్తి నర సింహ గౌడ్‌, నరేష్‌ ముదిరాజ్‌, సందీప్‌ సాగర్‌, ప్రదీప్‌ తదితరులు ఉన్నారు.

Spread the love