గణేష్ నిమజ్జనాలు శాంతి యుతంగా జరుపుకోవాలి: ఎస్సై కృష్ణారెడ్డి

నవతెలంగాణ మద్నూర్
గణేష్ ఉత్సవాల్లో భాగంగా గణేష్ నిమజ్జనాలు శాంతియుతంగా జరుపుకోవాలని మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి గణేష్ మండల్ల నిర్వాహకులకు తెలియజేశారు గణేష్ ఉత్సవాలపై శాంతి  కమిటీ సమావేశాన్ని సోమవారం నాడు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించారు ఈ శాంతి కమిటీ సమావేశానికి మండల కేంద్రంతో పాటు ఉమ్మడి మద్నూర్ మండలంలోని అన్ని గ్రామాల గణేష్ మండల నిర్వాహకులకు నిమజ్జనాలపై ఎస్సై అవగాహన కల్పించారు శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు జరుపుకోవాలని కోరారు డీజీలకు అనుమతులు లేవని ఏ గ్రామంలోనైనా సీరియల్ ప్రకారం నిమజ్జన కార్యక్రమాలు సమయపాలన పాటించి జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మద్నూర్ గ్రామ సర్పంచ్ సురేష్ ఎంపిటిసిలు మండలంలోని గణేష్ మండలాల నిర్వాహకులు పాల్గొన్నారు.
Spread the love