సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గంగారాం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి సొసైటీ వైస్ చైర్మన్ గా కుమ్మరి చిన్న గంగారాం (సుద్ద పల్లి) గురువారం ఇంచార్జీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ గజవాడ జైపాల్ తన పదవికి రాజీనామా చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ ఇంచార్జీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డైరక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కోరుతూ సభ్యులు తీర్మాణం  చేశారు. తీర్మాణం లేఖను డీసీవో కార్యాలయానికి పంపిస్తామని సీఈవో కిషన్ తెలిపారు. ఇంచార్జీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కుమ్మరి చిన్న గంగారాం ను డైరక్టర్లు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు బూస చిన్న నర్సింలు, బాలమల్ల సాయిలు, దాసరి రమేష్, రాంచందర్ గౌడ్ అంకం లత, తేనేటీ రాజమ్మ, లంబాని హరిచంద్, పడిగెల గంగారెడ్డి, ఏలేటీ సతీష్రెడ్డి, ఎడ్ల శాంసన్, సిబ్బంది ఓస సాయిలు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love