నల్గొండలో గంజాయి ముఠా అరెస్ట్

నవతెలంగాణ నల్గొండ: నల్గొండ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 12 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయి, రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Spread the love