బాధ్యతలు స్వీకరించిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పసుపుల సాయన్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ లోని గూపన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సాయన్న పదోన్నతి పై కమ్మర్ పల్లి ప్రభుత్వ  ఉన్నత పాఠశాలకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా నియమితులయ్యారు. సాయన్న స్వగ్రామం మండలంలోని ఉప్లూర్ గ్రామం. కమ్మర్ పల్లి ఉన్నత పాఠశాలలో 2005 నుండి 2015 వరకు సాయన్న  ఉపాధ్యాయుడిగా నిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సొంత మండల కేంద్రంలోని పాఠశాలకు పదోన్నతిపై రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన సాయన్నను  పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాతో సన్మానించారు.

Spread the love