తాడిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ మల్హర్ రావు: ప్రమాదవశాత్తు తాడిచెట్టుపై నుంచి పడి తాళ్లపల్లి సదయ్య గౌడ్ అనే గీతా కార్మికుడి తీవ్రమైన గాయాలైన సంఘటన మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.గ్రామస్తుల పూర్తి కథనం ప్రకారం సదయ్య గౌడ్ బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారీ తాడిచెట్టు పైనుండి కింద పడటంతో తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స కోసం భూపాలపల్లి లోని ప్రైవేట్ హాస్పిటల్ కు హుటా హుటిన తరలించారు కుడికాలు ఫ్యాక్చర్ అయిందని వైద్యులు నిర్ధారించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.విషయాన్ని తెలుసుకున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ బాధితున్ని పరామర్శించి, అధైర్య పడవద్దు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం సేఫ్టీ మోకులను తొందరగా అందించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఆయన వెంటా సాంబయ్య గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏరుకొండ సంపత్ కుమార్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ జిల్లాగౌరవ అధ్యక్షులు గడ్డం రామచంద్ర గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రమేష్ గౌడ్, చిట్యాల తెలంగాణ గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం సదానందం గౌడ్, తెలంగాణ గౌడ సంఘంజిల్లా ట్రెజరర్ మామిండ్ల శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి కె.వి అశోక్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పెరుమాండ్ల పెరుమల్ల తిరుపతి గౌడ్ ,ముత్యాల రాజబాబు గౌడ్ ముత్యాల వెంకన్న గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

Spread the love