మునుగోడు నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా  అవకాశం ఇవ్వండి

– మునుగోడు అసంబ్లీ  బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణా రెడ్డి…
నవతెలంగాణ – చండూరు 
ఈ నెల 30 న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే, కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటానికి కృషిచేస్తానని, మునుగోడు లో ఒకసారి ఎమ్మెల్యేగా  అవకాశం ఇవ్వాలని  మునుగోడు అసంబ్లీ  బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణా రెడ్డి ఓటర్లను  కోరారు  . ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని బొడంగి పర్తి, శిర్థపల్లి, ఉడతలపల్లి, పడమటి తాళ్ల,తస్కానిగూడెం గ్రామాలల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజక వర్గం  వెనుక బాటుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులే కారణం అన్నారు. గ్రామాలకు సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవని నన్ను గెలిపిస్తే రోడ్ల నిర్మాణానికి కృషిచేస్తా అన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తునే, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వం మునుగోడు పై ప్రత్యేక దృష్టి పేట్టిందన్నారు. బీజేపీని గెలిపిస్తే 4వందలకే సిలిండర్, పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామన్నారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ను పూర్తి చేసి సాగు,త్రాగు నీరు అందిస్తామని తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని, లేనిచో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని హామీ ఇచ్చారు. తాను పదవుల కోసం రాలేదని ప్రజల బతుకులు మార్చిటానికి వచ్చానన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటేసి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా,నాయకులు కాసాల. జనార్దన్ రెడ్డి, వరికుప్పల గిరి,కట్కూరి రామలింగయ్య, బరిగల లింగస్వామి, ఆవుల అశోక్, మనోహర్ ,వంగూరి యాదయ్య, పాలకూరి నాగరాజు, తదితరలు పాల్గొన్నారు.
Spread the love