ఇందూరు తిరుమలలో కన్నుల పండుగగా గోదా కళ్యాణం..

నవ తెలంగాణ – మోపాల్

మోపాల్ మండలంలోనినర్సింగ్ పల్లి గ్రామంలో ఆదివారం రోజున ఇందూరు తిరుమల దేవాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. వచ్చిన భక్తులందరూదైవదర్శన అనంతరం, ఆక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలరించిన భక్తి సంగీతామృత  భక్తి గీతాలు పాడిన ప్రముఖ సినీ,నేపథ్య గాయకులు సిద్దార్థ్ శాండిల్యాస మరియు విజయ్ ఐలేనీ,ఇందూరు తిరుమలలో శోభాయమానంగా కన్నుల పండుగగా శ్రీ గోదాదేవి కళ్యాణం జరిగింది. వేద పండితులు అర్చక స్వాములు సంపత్ కుమారాచార్య మరియు రోహిత్ కుమారాచార్య శ్రీ గోదాదేవి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అశేషంగా పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం కోలాహాలంగ మారింది. భక్తి పాటలపై ప్రముఖ నిర్మాత , ఆలయ కమిటీ ఛైర్మన్ దిల్ రాజు ఆడి పాడి చిందులేసారు. అందరిని భక్తి పారవశ్యంలో మునిగేట్టు చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నర్సింహా రెడ్డి దంపతులు, విజయ సింహారెడ్డి దంపతులు, దిల్ రాజు దంపతులు, నరాల సుధాకర్, నర్సారెడ్డి, రవిందర్ యాదవ్, లక్ష్మి, గంగారెడ్డి, సాయిలు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love