గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు ఇతర కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30 మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. కాగా గృహ వినియోగ అవసరాల కోసం ఉపయోగించే 14 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని కంపెనీలు స్పష్టం చేశాయి.

Spread the love