ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ

నవతెలంగాణ -హైదరాబాద్: నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా మొదలుకానున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5 టీ20ల సిరీస్‌కు బీసీసీఐ జట్టుని ప్రకటించింది. ఈ సిరీస్‌కు డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొన్న కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో సూర్యకు ఈ అవకాశం దక్కింది. ఇక ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రపంచ కప్ 2023 జట్టులో స్థానం దక్కిన ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే టీ20 జట్టులో చోటుదక్కింది. సూర్యకుమార్ యాదవ్‌తోపాటు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్‌లను మాత్రమే సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే చివరి 2 మ్యాచ్‌లకు శ్రేయాస్ అయ్యర్ జట్టులో చేరనున్నాడని, వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని బీసీసీఐ తెలిపింది.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా జట్టులో చేరతాడు.

Spread the love