చిక్కడపల్లిలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

నవతెలంగాణ – హైదరాబాద్: సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం. దశరథంను గెలిపించాలని ఇంటింటి ప్రచారం. చిక్కడపల్లి, సోఫా ఫ్యాక్టరీ లైన్, శ్యాం ప్రసాద్ నగర్, ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు ఎం దశరథ్ ను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. చిక్కడపల్లి ప్రాంతం కాలనీ అయినప్పటికీ ధనికులు ఉన్నత విద్యా వంతులు నివాసం ఉన్నప్పటికీ అనేక సమస్యలు నెలకొన్నాయని, ఈ సమస్యలపై గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు గానీ ప్రజా ప్రతినిధులు గాని ఒక్కరు పనిచేయడం లేదని, ఈ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయలేదని, సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపిస్తే కాలనీలో నెలకొన్న అనేక సమస్యలు పరిష్కారం చేస్తామని తిరుగుతూ కాలనీ వాసులను చైతన్య పరుస్తూ ఎలక్షన్ గుర్తు సుత్తె కోడవలి నక్షత్రం చూపిస్తూ ఓటు వేయమని వారు ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి.రాములు, డి. సైదులు, పీ.లక్ష్మి టి. నిరంజన్ డి. వీరయ్య, పీ. ఎల్లమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎం.దశరథం ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం
             ( సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎం.దశరథం ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం)
Spread the love