సమ్మె విరమించిన జీపీ కార్మికులు

నవతెలంగాణ – అశ్వారావుపేట
సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం తో పంచాయతీ కార్మికులు మంగళవారం సమ్మె విరమించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు లు పంచాయతీ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదించి నెరవేర్చు తాము అని పంచాయతీ రాజ్ కార్మికుల సంఘం రాష్ట్ర జె.ఏ.సీ కమిటీకి తెలపటం తో పంచాయతీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరినట్లు నాయకులు పిట్టల అర్జున్,కామేష్, అప్పన్న, నందు,వెంకటప్పయ్య, నర్సింహ రావు, నాగేంద్రరావు, ముత్తారావు, బుజ్జమ్మ, రాణి తదితరులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
Spread the love